
దేశం కోసం ప్రాణాలు అర్పించిన మీ త్యాగాలను మరువలేమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. గత కొన్నాళ్లుగా రెండు దేశాల మద్య ఘర్షణ వాతావరణం ఉన్న...
దేశం కోసం ప్రాణాలు అర్పించిన మీ త్యాగాలను మరువలేమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. గత కొన్నాళ్లుగా రెండు దేశాల మద్య ఘర్షణ వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో వవన్ ఈ ట్వీట్ చేశారు.
భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో ముగ్గరు అమరులు కావడం కలవరపరచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ ముగ్గురు వీరులకి తన తరపున, జనసేన తరపున నివాళి ఘటిస్తున్నానన్నారు. ఈ అమరుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ ఉన్నారని తెలిసి బాధపడ్డానని చెప్పారు. కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి సైన్యానికి వెళ్ళిన ఆ దేశభక్తుడిని ఈ నేల ఎన్నటికీ మరువదన్నారు. ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చెప్పారు. కల్నల్ సంతోష్ భార్య, బిడ్డలకు, కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని పవన్ వేడుకున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



