జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీమ పర్యటన వివరాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీమ పర్యటన వివరాలు
x
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'జనసేన ఆత్మీయ యాత్ర' పేరుతో రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం తిరుపతికి రానున్నారని ఆ పార్టీ...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'జనసేన ఆత్మీయ యాత్ర' పేరుతో రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం తిరుపతికి రానున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌నాయుడు, జిల్లా నాయకులు కిరణ్‌రాయల్‌ తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి తిరుపతి కెన్సస్‌ హోటల్లో తిరుపతి, చిత్తూరు పార్లమెంటరీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.

అలాగే 3న మంగళవారం ఉదయం 10.30గంటల నుంచి అదే హోటల్లో కడప, రాజంపేట పార్లమెంటరీ నేతలతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. 4న బుధవారం పవన్‌కళ్యాణ్‌ తిరుపతి నుంచి భాకరాపేట, పీలేరు మీదుగా మదనపల్లికి చేరుకుంటారని తెలిపారు. మదనపల్లిలో సమావేశం అనంతరం రాత్రి హార్స్‌లీ హిల్స్‌లో బస చేస్తారన్నారు. 5న ఉదయం మదనపల్లి హార్స్‌లీహిల్స్‌ నుంచి అనంతపురం జిల్లా హిందూపురం వెళతారని వారు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories