
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతోంది. నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అన్ని కూడా ఎన్నికలకు సిద్ధమైయ్యాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు వ్యూహాలను పదును పెడతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు జనసేన పార్టీ కూడా సిద్దమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపికతో పాటూ.. ప్రచారంలోనూ నిమగ్నమయ్యాయి. ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికలకు జిల్లాలవారీగా సమన్వయకర్తల నియమించారు. నామినేషన్ దశ నుంచి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అన్ని కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటారు. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో 13 జిల్లాలకు సమన్వయకర్తల వివరాలు వెల్లడించింది.
చిత్తూరు ( బొలిశెట్టి సత్య), కడప ( డా.పి.హరిప్రసాద్), కర్నూలు ( టి.సి.వరుణ్), అనంతపురం ( చిలకం మధుసూదన్ రెడ్డి), కృష్ణా జిల్లా ( పోతిన మహేశ్),గుంటూరు( వత్త కళ్యాణం శివ శ్రీనివాస్ ), ప్రకాశం (ఉషేక్ రియాజ్), నెల్లూరు (సి.మనుక్రాంత్ రెడ్డి), శ్రీకాకుళం జిల్లా ( డాక్టర్ బి.రఘు), విజయనగరం జిల్లా (గడసాల అప్పారావు ), విశాఖపట్నం (రూరల్) (సుందరపు విజయ్ కుమార్), తూర్పుగోదావరి జిల్లా (బొమ్మదేవర శ్రీధర్ (బన్ను) పశ్చిమ గోదావరి జిల్లా ( ముత్తా శశిధర్) సమన్వయకర్తలుగా నియమించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలవారీగా జనసేన సమన్వయకర్తల నియామకం pic.twitter.com/I0qpaLAjHP
— JanaSena Party (@JanaSenaParty) March 8, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




