ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ త్వరలోనే జైలుకు వెళ్తారని జోస్యం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ త్వరలోనే జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. జగన్ జైలుకు వెళ్తే సీఎం కావాలని నలుగురు మంత్రులు ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి, అలాగే ఎమ్మెల్యే రోజా సీఎం కావాలని కలలు కంటున్నారని అనురాధ అన్నారు.
బీసీలను హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా తప్పించుకుంటుందని విమర్శించారు. పైరవీల కోసమే సచివాలయాలు మంత్రి కన్నబాబు చాలా నీచంగా మాట్లాడుతున్నారని అనురాధ విమర్శించారు. సీఎం జగన్ రద్దుల రెడ్డిగా.. చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. శాసనసభను రద్దు చేసి అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల మంది ప్రజల మోసం చేశారని దుయ్యబట్టారు. శాసనమండలి రద్దు చేశారని విర్రవిగుతున్నారని మండలిలో 20 మంది బడుగు బలహీనవర్గాల వారే ఉన్నారని గుర్తు చేశారు.
శాసనమండలి రద్దుపై అంశంపై సీఎం జగన్ పునః సమీక్షించాలని, తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బొత్స, పెద్దిరెడ్డి, రోజా సీఎం పిఠంపై కన్నేశారని అందుకే ప్రతిపక్ష నేత అని కూడా చూడకుండా చంద్రబాబును తీవ్ర స్థాయిలో దూషిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులను సీఎం జగన్ దోపిడీ చేసి జనం మధ్యలో తిరుగుతున్న జగన్ ను ఏమనాలని అనురాధా ప్రశ్నించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire