మారకపోతే క్యాబినెట్ నుండి తొలగిస్తా.. సీఎం వార్నింగ్

మారకపోతే క్యాబినెట్ నుండి తొలగిస్తా.. సీఎం వార్నింగ్
x
Highlights

మారకపోతే క్యాబినెట్ నుండి తొలగిస్తా.. సీఎం వార్నింగ్ మారకపోతే క్యాబినెట్ నుండి తొలగిస్తా.. సీఎం వార్నింగ్

అమరావతి సెక్రటేరియట్‌లో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన సహచరులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేకంగా మంత్రుల పేర్లు చెప్పకుండా.. వారిని హెచ్చరించారు. అవినీతికి పాల్పడితే మంత్రులను కేబినెట్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. నిజానికి, ఇది మంత్రులకు ఆయన ఇచ్చిన రెండవ హెచ్చరిక. దీనిపై సుమారు ఐదు నిమిషాల పాటు సీఎం మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో క్యాబినెట్ హాలులో మంత్రులు అందరు ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు.

"ఒకరిద్దరి మంత్రుల అవినీతి గురించి నా దృష్టికి వచ్చింది. నేను ఇక్కడ పేర్లను బహిర్గతం చేయడం మంచిది కాదు.. వారితో వ్యక్తిగతంగా మాట్లాడతాను. మీరు మారకపోతే మీడియా ప్రతి మూమెంట్ ను వాచ్ చేస్తోంది.. అవినీతి ఆలోచనలను వదులుకోండి.. ఇంకా మీరు మారకపోతే మీడియా ద్వారా బహిర్గతమైతే, నాపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో నేను మిమ్మల్ని కేబినెట్ నుండి తొలగిస్తాను. " అని కేబినెట్ సమావేశంలో జగన్.. మంత్రులనుద్దేశించి అన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories