CM Jagan: విబేధాలను పక్కటన పెట్టి.. కలిసికట్టుగా పనిచేయాలి

CM Jagan: విజయవాడ తూర్పు నియోజకవర్గంపై జగన్ ఫోకస్

Jyothi
Published on: 5 Jan 2023 7:56 AM IST
Jagan Focus on Vijayawada East Constituency
X

CM Jagan: విబేధాలను పక్కటన పెట్టి.. కలిసికట్టుగా పనిచేయాలి

CM Jagan: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రతీ కార్యకర్తతో విడివిడిగా మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న జగన్.. నియోజకవర్గ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మరో 15నెలల్లో ఎన్నికలు రాబోతున్నందున గడపగడపకు కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతున్నామని తెలిపారు. ప్రజలతో పార్టీ కేడర్‌ మమేకం కావాలన్నారు. వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర‌ కాన్సెప్ట్‌ కూడా పూర్తిస్థాయిలో వస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని విబేధాలను పక్కన పెట్టి అంతా కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. ఈసారి గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని తెలిపారు సీఎం జగన్‌.

Jyothi

Jyothi

Next Story