తనపై నింద వేశారన్న కారణంగా విద్యార్థిని ఆత్మహత్య

తనపై నింద వేశారన్న కారణంగా విద్యార్థిని ఆత్మహత్య
x
Highlights

అసలు తాను చేయని తప్పుకు నింద వేశారన్న కారణంగా ఓ విద్యార్థిని ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు శివారులో ఉన్న విజ్ఞాన్ కళాశాలలో చోటుచేసుకుంది....

అసలు తాను చేయని తప్పుకు నింద వేశారన్న కారణంగా ఓ విద్యార్థిని ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు శివారులో ఉన్న విజ్ఞాన్ కళాశాలలో చోటుచేసుకుంది. ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతున్న గూడపాటి శశి(17) అనే విద్యార్థినిపై తొటి స్నేహితులు దొంగతనం నింద వేశారు. అయితే ఇటీవల ఓ విద్యార్థిని బ్యాగులో డబ్బులు పోవడంతో శశిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య గత కొన్నిరోజులుగా వారి మధ్యగొడవలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో శశి తీవ్రంగా కలత చెందింది. బుధవారం రాత్రి హాస్టల్ బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం బాత్‌రూమ్‌లో శశి వేలాడుతూ కనిపించడంతో విద్యార్థినులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే గట్టిగా కేకలు వేయడంతో కళాశాల యాజమాన్యం అక్కడి చేరుకొని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటినా అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories