పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం
* అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు వేసిన గుర్తు తెలియని వ్యక్తులు * రెచ్చగొట్టి గొడవలు పెట్టాలని చూస్తున్నారని.. * వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్
Ambedkar statue In Chintalapudi
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసి అవమానించారు. ఈ అవమానం కే కాదని. దేశ ప్రజలందరికీ జరిగినట్లేనన్నారు స్థానికులు. కుల, మతాలను రెచ్చగొట్టి గొడవలు జరపాలని చూస్తున్నారన్నారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.
Next Story




