వైఎస్‌ జగన్‌కు భారత రాయబారి విందు!

వైఎస్‌ జగన్‌కు భారత రాయబారి విందు!
x
Highlights

అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తన నివాసంలో విందు ఏర్పాటు...

అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. భారతీయ వంటకాలతో ఆంధ్రప్రదేశ్ అతిధులకు ఆతిధ్యం ఇచ్చారు. ఈ విందులో జగన్ తోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు వివిధ రంగాలకు చెందిన పెట్టుబడిదారులతో సీఎం భేటీ అయ్యారు. ఏపీకి చెందిన ఔషధ కంపెనీలతో భాగస్వామ్యానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ గిలీడ్‌ ప్రతినిధిని కోరారు. అనంతరం అమెరికా విదేశాంగ శాఖ దక్షిణాసియా వ్యవహారాల ఉన్నతాధికారులతోనూ సమావేశమై చర్చించారు. అట్లాంటిక్‌ కౌన్సిల్‌ దక్షిణాసియా సెంటర్‌కు చెందిన ఇర్ఫాన్‌ నూరుద్దీన్‌ కూడా సీఎంను కలిశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories