టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం!

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం!
x
Highlights

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు.. ఆయన ఆస్తులను వేలం వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రుణఎగవేత కేసులో ఆయన...

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు.. ఆయన ఆస్తులను వేలం వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రుణఎగవేత కేసులో ఆయన ఆస్తులను వేలం వేయడానికి బ్యాంకు అధికారులు సిద్ధమయ్యారు. ఆయనకు చెందిన ప్రత్యుష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ఫ్రై లిమిటెడ్‌ పేరు మీద ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి భారీగా రుణం తీసుకున్నారు.. అయితే అ రుణాన్ని తిరిగి చెల్లించాలని గంటాకు అక్టోబర్‌ 4న బ్యాంకు అధికారులు డిమాండ్‌ నోటీసు కూడా పంపారు.

కానీ ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో డిసెంబర్‌ 20న ఆయన వ్యక్తిగత ఆస్తులను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం రుణ బకాయిలు రూ.200 కోట్లు కాగా తనాఖా పెట్టిన ఆస్తుల విలువ కేవలం రూ.35 కోట్ల 35 లక్షల 61 వేలు ఉన్నట్లు సమాచారం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 444 గజాల్లో నిర్మించిన ప్లాట్‌ను వేలం వేయనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories