ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీకి ప్రమోషన్‌

ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీకి ప్రమోషన్‌
x

శ్రీలక్ష్మి ఫైల్ ఫోటో 

Highlights

ఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి ఏపీ ప్రభుత్వం ప్రమోషన్‌ ఇచ్చింది. ఇటీవలే ఆమె పురపాలక శాఖ కార్యదర్శిగా పదవీబాధ్యతలు చేపట్టారు. కార్యదర్శి ర్యాంక్ నుంచి...

ఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి ఏపీ ప్రభుత్వం ప్రమోషన్‌ ఇచ్చింది. ఇటీవలే ఆమె పురపాలక శాఖ కార్యదర్శిగా పదవీబాధ్యతలు చేపట్టారు. కార్యదర్శి ర్యాంక్ నుంచి ముఖ్య కార్యదర్శిగా ఆమెకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. శ్రీలక్ష్మి మీద ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు, డీవోపీటీ నిర్ణయం మేరకు అమలు జరుగుతుందని, తుది తీర్పులకు లోబడే ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

శ్రీలక్ష్మి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవై ఏపీ కేడర్ లో చేరారు. డిప్యుటేషన్ మీద ఆమె తెలంగాణ నుంచి ఏపీకి రావాలని ఆమె తొలుత భావించారు. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఆమె తన కేడర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్పించుకున్నారు. క్యాట్ ఆదేశాల మేరకు ఆమెను తెలంగాణ ప్రభుత్వం రివీల్ చేసింది. ఇటీవల ఆమె అమరావతిలోని జీఎడీలో రిపోర్టు చేశారు శ్రీలక్ష్మి డిప్యుటేషన్ మీద తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి సీఎం వైఎస్ జగన్ కూడా సుముఖత వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories