భర్తను దారుణంగా హత్య చేసిన భార్య

భర్తను దారుణంగా హత్య చేసిన భార్య
x
Highlights

భర్తను దారుణంగా హత్య చేసిన భార్య భర్తను దారుణంగా హత్య చేసిన భార్య

భర్త ప్రవర్తనపై విసుగుచెందిన మహిళ అతన్ని దారుణంగా హతమార్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పెనుమాకకు చెందిన రత్నకుమార్, సునీతకు 14 ఏళ్ళ కిందట వివాహం జరిగింది. వీరికి కొడుకు, కూతురు సంతానం. అయితే రత్నకుమార్ విజయనగరానికి చెందిన సమీప బంధువుతో సాన్నిహిత్యం కొనసాగిస్తున్నాడు. అప్పుడప్పుడు ఆమె వద్దకు వెళ్ళేవాడు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో పనిచేస్తున్న ఆమె భర్తతో విబేధాల కారణంగా విడిగా ఉంటోంది. సునీత ఎన్నిసార్లు చెప్పినా రత్నకుమార్ ప్రవర్తనలో మార్పు రాలేదు.

ఈ క్రమంలో సదరు మహిళను తీసుకుని పెనుమాక వచ్చాడు. ఈ విషయమై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో విసుగుచెందిన సునీత భర్తను ఎలాగైనా హతమార్చాలని అనుకుంది. అందులో భాగంగా రాత్రి కొడుకుని మేనత్త ఇంటికి పంపింది. రత్నకుమార్ కూతురుతో వేరే గదిలో నిద్రిస్తుండగా సునీత రోకలిబండతో అతని తలపై మోదింది. దాంతో తీవ్ర గాయాలతో రత్నకుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్తను హత్య చేశానని లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories