పండగపూట విషాదం : లారీ ఢీకొని భర్త మృతి, భార్య పరిస్థితి విషమం

పండగపూట విషాదం : లారీ ఢీకొని భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
x
Highlights

పండగ వేళ ఓ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది. దీంతో భర్త మృతిచెందాడు

పండగ వేళ ఓ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది. దీంతో భర్త మృతిచెందాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలోని గ్రంథాలయం సమీపంలో ఆదివారం జరిగింది. ముమ్మిడివరం గ్రామానికి చెందిన మాకే శ్రీనివాస్‌(30) , ఆయన భార్య ఇద్దరు కలిసి బైక్ పై ప్రయాణిస్తున్నారు. ఇంతలో వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతి చెందగా..భార్య పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన ఆమెను మెరుగైన చికిత్స కోసం అమలాపురం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories