అత్తా.. నీ కూతుర్ని చంపా.. పోయి చూసుకో..

అత్తా.. నీ కూతుర్ని చంపా.. పోయి చూసుకో..
x
Highlights

అనుమానం పెనుభూతమైంది.. ఈ కారణంగా కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరులో చోటుచేసుకుంది. మండలంలోని...

అనుమానం పెనుభూతమైంది.. ఈ కారణంగా కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరులో చోటుచేసుకుంది. మండలంలోని తూర్పుగంగవరం గ్రామానికి చెందిన నగళ్ల అంజయ్య, రాణి దంపతుల కుమార్తె నాగరత్న (28)ని దొనకొండ మండలం పెద్దన్నపాలేనికి చెందిన కండె పుల్లయ్యకు ఇచ్చి 11 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఇద్దరు సంతానం. పుల్లయ్య కొన్నేళ్ల కిందట మద్యానికి బానిసయ్యాడు. దాంతో పిల్లల్ని తీసుకొని తల్లిగారింటికి వచ్చింది నాగరత్న.. ఈ క్రమంలో కొద్దిరోజులకే పుల్లయ్య కూడా అత్తారింటికి వచ్చేశాడు. దొనకొండలో ముటాపని చేస్తున్నాడు. మితభాషిగా ముద్రపడిన పుల్లయ్య ఇంట్లో భార్యను మాత్రం అనుమానంతో కాచుకుతినేవాడు. ఆమె పొరుగూరికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతున్నట్టు పుల్లయ్య అనుమానించాడు.

ఈ విషయంలో దంపతులకు కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే అవి ఇటీవల శృతిమించాయి. ఈ నేపథ్యంలో నాగరత్నం నిద్రించేందుకు శుక్రవారం అర్ధరాత్రి మిద్దెపైకి వెళ్లింది. అర్ధరాత్రి వరకు మద్యం తాగి వీధుల్లో తిరిగి వచ్చిన భర్త పుల్లయ్య నేరుగా మిద్దెపైకి వెళ్లాడు. ఆ సమయంలో భార్య ఎవరో గుర్తు తెలియని వ్యక్తితో ఉన్నట్లు అనుమానించాడు. కోపోద్రిక్తుడైన పుల్లయ్య ఆమెను గోడకేసి కొట్టాడు. దాంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మరణించిందని తెలుసుకున్న పుల్లయ్య కిందకు వచ్చి అత్తను నిద్ర లేపి మీ కుమార్తెను చంపాను..పోయి చూసుకో..అని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె ఇరుగుపొరుగు సాయంతో కూతురిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే నాగరత్న మరణించింది. దీనిపై ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories