Srisailam: శ్రీశైలం హుండీ ఆదాయం రూ. 2,87,01,092 కోట్లు

Hundi Counting At Srisailam Mallanna Temple
x

Srisailam: శ్రీశైలం హుండీ ఆదాయం రూ. 2,87,01,092 కోట్లు

Highlights

Srisailam: 162 గ్రాముల బంగారం, 7 కేజీల 110 గ్రాముల వెండి

Srisailam: శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా.. ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 2 కోట్ల, 87లక్షల, ఒక వెయ్యి, 92 రూపాయల నగదు రాబడిగా లభించింది. ఈ ఆదాయాన్ని గత 22 రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ ఈవో లవన్న తెలిపారు.

హుండి లెక్కింపులో నగదుతో పాటు 162 గ్రాముల బంగారు, 7 కేజీల 110 గ్రాముల వెండి లభించాయి. యుఎస్ఏ డాలర్లు 191, కెనడా డాలర్లు 110, ఖత్తర్ డాలర్లు 4, ఇంగ్లాండ్ డాలర్లు 35, మలేషియా రింగిట్స్7, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో లవన్న పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు, సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories