48 గంటల్లో వాయుగండం..

48 గంటల్లో వాయుగండం..
x
Highlights

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తీరాల మీదుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తీరాల మీదుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనం మరింత బలపడే ఉందని.. ఇది 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాయుగుండంగా కోస్తాంధ్ర తీరం వైపుగా కదులుతోందని.. దీని ప్రభావంతో రానున్న 48 గంటల పాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని.. అలాగే తీరం వెంబడి గంటకు 45 కి.మీ. నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని హెచ్చరించారు.

మరోవైపు మంగళవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో.. కృష్ణా జిల్లాలో మంగళవారం 22 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నెల్లూరులో 10 సెంటీమీటర్లు, ఒంగోలులో 7, అమలాపురం, కందుకూరు, అగలిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ప్రకాశం జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories