తిరుమలేశునికి భారీ విరాళం

Tirumala: *రూ.2.25 కోట్ల విలువైన 4.125 గ్రాముల లక్ష్మీహారం, యజ్ఞోపవీతం విరాళం

Sriveni Erugu
Published on: 10 Jun 2022 8:21 AM IST
Huge donation to Thirumalesha
X

తిరుమలేశునికి భారీ విరాళం

Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందచేసింది చెన్నైకి చెందిన భక్తురాలు. దాదాపు 2.45 కోట్ల రూపాయల విలువజేసే నాలుగు కేజీల బంగారాన్ని శ్రీవారికి విరాళంగా ఇచ్చి ఏడుకొండల స్వామిపై తనకున్న భక్తిని చాటుకుంది సరోజా సూర్యనారాయణ అనే భక్తురాలు. వజ్రాలు అమర్చిన 4 వేల150 గ్రాముల బంగారం యజ్ఞోపవీతం, లక్ష్మీ కాసుల హారాన్ని శ్రీవారికి కానుకగా సమర్పించింది. చైన్నై నగరంలో రూ.3.50 కోట్లు విలువజేసే తన స్థలాన్ని కూడా విరాళంగా అందజేసింది. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలను అందించింది భక్తురాలు సరోజా సూర్య నారాయణ.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story