తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Huge Devotees Rush At Tirumala Tirupati Temple
x

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Highlights

Tirumala: ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం

Tirumala: కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారిని 81 వేల 57 మంది భక్తులు దర్శించుకోగా.. 27 వేల 913 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 3 కోట్ల 80 లక్షల ఆదాయం చేకూరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories