గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్‌(స్క్రీనింగ్‌ టెస్టు) తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌...

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్‌(స్క్రీనింగ్‌ టెస్టు) తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రిలిమ్స్‌ పేపర్‌–1, పేపర్‌–2 ఫైనల్‌ కీని కూడా విడుదల చేసింది. మొత్తం 167 పోస్టుల భర్తీకి మే 26న ప్రిలిమ్స్‌ నిర్వహించారు.. అయితే అందులో 1:50 రేషియో పద్ధతిలో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 8,350 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. ఇక మెయిన్స్‌ ఎంపికకు కటాఫ్‌గా 90.42 మార్కులను నిర్దేశించింది. ఇదిలావుంటే ఈ పరీక్ష ఫలితాలను వెల్లడించవద్దని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వును ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులను తాజాగా హైకోర్టు ఎత్తేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌ ఉత్తర్వులిచ్చారు. దీంతో ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories