Governor S Abdul Nazeer: 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం


Governor S Abdul Nazeer: 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం
Governor S Abdul Nazeer: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు.
Governor S Abdul Nazeer: ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు గవర్నర్ అబ్ధుల్ నజీర్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నారని...అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్ సీ దస్త్రంపై సంతకం చేశారని గవర్నర్ అబ్ధుల్ నజీర్ తెలిపారు.
2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ అన్నారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలిరోజు ఉభయసభలనుద్దేశించిన గవర్నర్ ప్రసంగించారు. ప్రతినెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని తన ప్రసంగంలో గవర్నర్ తెలిపారు.
విద్య, వైద్యం, మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బీసీవర్గాలు కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని...స్థానికసంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గవర్నర్ అబ్ధుల్ నజీర్ తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



