విశాఖ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి.. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ..

విశాఖ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి.. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ..
x
Highlights

విశాఖ ఎల్‌జి పాలిమర్స్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని...

విశాఖ ఎల్‌జి పాలిమర్స్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు గవర్నర్ తెలిపారు. ప్రజల తరలింపులో రెడ్ క్రాస్ వాలంటీర్ ల సేవలను వియోగించుకోవాలని సూచించారు గవర్నర్. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విశాఖ రెడ్ క్రాస్ కు ఆదేశాలు జారీ చేశారు.

గ్యాస్‌ లీకేజీ జరిగిన ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మరికొద్ది సేపట్లో రానున్నారు. సహాయక చర్యలను సమీక్షించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. అంతకుముందు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories