6న ఈ కేంద్రాల్లో రీ పోలింగ్‌

6న ఈ కేంద్రాల్లో రీ పోలింగ్‌
x
Highlights

ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీ...

ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో బూత్‌ నంబర్‌ 94, గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలోని బూత్‌ నంబర్‌ 244, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బూత్‌ నంబర్‌ 41, సుళ్లూరుపేట నియోజకవర్గంలో బూత్‌ నంబర్‌ 97, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం బూత్‌ నంబర్‌ 197లో రీ పోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు అధికారులు తగు ఏర్పాట్లు చెయ్యాలని ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories