గ్రామ సచివాలయం అభ్యర్థులకు శుభవార్త.. 4 మార్కులు

గ్రామ సచివాలయం అభ్యర్థులకు శుభవార్త.. 4 మార్కులు
x
Highlights

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5, మహిళా పోలీసు, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌...

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5, మహిళా పోలీసు, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ పోస్టులకు పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ 2 మార్కులు కలపాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్షల్లో రెండు ప్రశ్నల్లో తప్పులు దొర్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ పరీక్ష 4,465 కేంద్రాల్లో జరిగింది. ఇందుకోసం మొత్తం 11,62,164 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరోవైపు డిజిటల్ అసిస్టెంట్ పరీక్షలో కూడా 2 ప్రశ్నల్లో తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ 2 మార్కులు కలపాలని నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories