Andhra Pradesh: సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తా: పల్లంరాజు

Andhra Pradesh: సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తా: పల్లంరాజు
x
Highlights

విశాఖకు రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తానని అన్నారు కేంద్ర మాజీ మంత్రి ముళ్ళపూడి మంగపతి పల్లంరాజు.

విశాఖకు రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తానని అన్నారు కేంద్ర మాజీ మంత్రి ముళ్ళపూడి మంగపతి పల్లంరాజు. అయితే ఇది తన వ్యక్తిగత నిర్ణయమని అన్న పల్లంరాజు.. పార్టీ నిర్ణయాన్ని పీసీసీ అధ్యక్షుడు వెల్లడిస్తారని చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనబెట్టి చంద్రబాబు అమరావతిని ఎంపిక చేశారని అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మాట్లాడిన పల్లంరాజు ఈ వ్యాఖ్యల తోపాటు పోలవరం పూర్తి చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

పవిత్రమైన వాతావరణం లో తిరుమల ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతుందని.. తిరుమలలో ఏర్పాట్లు బాగా ఉన్నాయని ఈ విషయంలో అధికారులు, బోర్డు సభ్యులను అభినందిస్తున్నట్టు పల్లంరాజు చెప్పారు. అంతేకాదు తిరుమల లో ఉన్న ప్లాస్టిక్ నిషేధం రాష్ట్రవ్యాప్తంగా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా కాకినాడకు వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు పల్లంరాజు. 2009 లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఆయనను ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షునిగా నియమిస్తారని వార్తలు కూడా వచ్చాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories