విశాఖ జిల్లాలో టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

విశాఖ జిల్లాలో టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే
x
Highlights

విశాఖ జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది.. ఇప్పటికే యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేయగా.. తాజాగా గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

విశాఖ జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది.. ఇప్పటికే యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేయగా.. తాజాగా గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్.. ఎంపీ విజాయసాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సమక్షంలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గురుమూర్తిరెడ్డి ప్రజారాజ్యం అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.

ఆ తరువాత టీడీపీలో చేరారు. గాజువాక టిక్కెట్ ఆశించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే చింతలపూడి వెంకటరామయ్య కూడా రెండు రోజుల కిందటే వైసీపీలో చేరారు. గాజువాక లో ఆయన సమీప బంధువు తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. గురుమూర్తి రెడ్డి కారణంగానే 2009 లో నాగిరెడ్డి ఓడిపోయారని అంటుంటారు. 2009 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నాగిరెడ్డి 33 వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories