తిరుమల బూందీ పోటులో అగ్నిప్రమాదం

తిరుమల బూందీ పోటులో అగ్నిప్రమాదం
x
శ్రీవారి లడ్డు తయారీ కేంద్రం
Highlights

తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కేంద్రం బూందీ పోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కేంద్రం బూందీ పోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం పనులు జరుగుతున్న ప్రాంతంలో పోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఉలిక్కిపడిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. స్వల్ప నష్టం మినహా ప్రమాదమేమీ లేదని అధికారులు తెలిపారు.

అగ్నిప్రమాదం సంభవించడంతో తాత్కాలికంగా లడ్డుల తయారీ ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పారు. ఓ కార్మికుడు చేతిలో ఉన్న నెయ్యి కప్పు జారిపడి ఓవెన్ మీద పడటంతో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఘటన గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు బూందీ పోటు కేంద్రాన్ని సందర్శించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఘటనపై ఆరాతీశారు. కాగా ఈ రోజు కైసిక ఏకాదశి సందర్బంగా ఆనవాయితీ ప్రకారం.. టీటీడీ తరపున శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు వైవీ సుబ్బారెడ్డి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories