Giddalur: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

Giddalur: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
x
శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు
Highlights

పట్టణంలోని మార్కెట్ యార్డులో శనగలు, కందుల కేంద్రాన్ని శనివారం గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు ప్రారంభించారు.

గిద్దలూరు: పట్టణంలోని మార్కెట్ యార్డులో శనగలు, కందుల కేంద్రాన్ని శనివారం గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రైతులకు అండగా ఉండేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.

కొనుగోలు కేంద్రంలో రైతులకు క్వింటాల్ కందులు రూ. 5,800 లు, శనగలు రూ. 4,870 లుగా గిట్టుబాటు ధర కల్పించిందని, కాబట్టి ఈ అవకాశాన్ని రాచర్ల, కొమరోలు, గిద్దలూరు మండలాలకు చెందిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు ఛైర్మన్ షేక్ మెహతాబ్, వైఎస్సార్ పార్టీ నాయకులు సిఎచ్ రంగారెడ్డి, కోటా నరసింహులు, ఆర్ డీ రామకృష్ణ, జనార్ధన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories