తహసీల్దార్ వనజాక్షిని అడ్డుకున్న ప్రజలు

తహసీల్దార్ వనజాక్షిని అడ్డుకున్న ప్రజలు
x
తహసీల్దార్ వనజాక్షిని అడ్డుకున్న ప్రజలు
Highlights

కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కొత్తూరు తాడేపల్లిలో ఇళ్ల స్థలాల విషయంపై ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన అధికారులను స్థానిక...

కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కొత్తూరు తాడేపల్లిలో ఇళ్ల స్థలాల విషయంపై ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన అధికారులను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. కొత్తూరులో వ్యవసాయ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు అధికారులు అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తహసీల్దార్ వనజాక్షి రాగా స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. తమ భూములు తీసుకునేందుకు వీల్లేదని వనజాక్షితో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసుల సాయంతో తహసీల్దార్ అక్కడి నుంచి వెనుదిరిగారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories