Anantapur: తల్లిదండ్రులు దూరమయ్యారని.. మూడేళ్లుగా ఇంటికే పరిమితం

Family In Self Lockdown At Their House in Anantapur for Three Years
x

Anantapur: తల్లిదండ్రులు దూరమయ్యారని.. మూడేళ్లుగా ఇంటికే పరిమితం

Highlights

Anantapur: తల్లిదండ్రుల మృతిని జీర్ణించుకోలేని ముగ్గురు మూడేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు.

Anantapur: తల్లిదండ్రుల మృతిని జీర్ణించుకోలేని ముగ్గురు మూడేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. అనంతపురం జిల్లా వేణుగోపాల్ నగర్‌లో జరిగిన ఈ సంఘటన ప్రతీ ఒక్కరికి ఆశ్చర్యం కలిగించింది. అంబటి తిరుపాల్ శెట్టికి అక్క విజయలక్ష్మి, చెల్లెలు కృష్ణవేణి ఉన్నారు. వీరి తండ్రి 2016లో, తల్లి 2017లో అనారోగ్యంతో చనిపోయారు. దీంతో మానసికంగా కుంగిపోయిన వీరు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నారు. ఇంట్లోనే పార్సిల్ ఫుడ్ తింటూ కాలం వెళ్లదీశారు. చివరకి బిల్లు చెల్లించలేదని రెండేళ్ల క్రితం విద్యుత్తు అధికారులు కరెంట్ కట్ చేశారు. అయినా బయటకు రాకపోవడంతో విసుగు చెందిన స్థానికులు బలవంతంగా తలుపులు తెరిపించారు. బయటకు రావాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories