వారు వీడితే టీడీపీ మనుగడ కనుమరుగే : మాజీ సీఎస్ ఐవైఆర్

వారు వీడితే టీడీపీ మనుగడ కనుమరుగే : మాజీ సీఎస్ ఐవైఆర్
x
Highlights

బీజేపీ , జనసేన పార్టీ పొత్తుపై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ , బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. వెనుకబడిన తరగతుల నాయకత్వం టీడీపీని వీడితే ఆ పార్టీ...

బీజేపీ , జనసేన పార్టీ పొత్తుపై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ , బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. వెనుకబడిన తరగతుల నాయకత్వం టీడీపీని వీడితే ఆ పార్టీ మనుగడ కనుమరుగు అవుతుందని పేర్కొన్నారు. అలాగే బీజేపీకి సూచన చేస్తూ.. ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో.. 'తెదేపా ప్రధాన బలం పార్టీ వెంట ఉన్న వెనుకబడిన తరగతులు వారి నాయకత్వం. జనసేన పొత్తు తర్వాత భాజపా ప్రధాన దృష్టి ఈ వెనుకబడిన తరగతుల నాయకత్వాన్ని తమ పార్టీలోకి ఆకర్షించు కోవడం మీద ఉండాలి.

ఈ నాయకత్వం టిడిపిని వీడితే ఆ పార్టీ కనుమరుగు అవ్వటం ఖాయం. ఆ స్థానాన్ని ఈ నూతన కూటమి ఆక్రమించ వచ్చు' అని ఐవైఆర్ ట్వీట్ చేశారు. కాగా ఏపీలో బీజేపీ , జనసేన పార్టీలు ఈనెల 17న పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తు గురించి మాట్లాడానికి గతవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని బీజేపీ వర్కింగ్ ప్రసిడెంట్ జయప్రకాశ్ నడ్డాతో చర్చలు జరిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories