కలాం నా దగ్గరే విజన్‌ నేర్చుకున్నారు : చంద్రబాబు

కలాం నా దగ్గరే విజన్‌ నేర్చుకున్నారు : చంద్రబాబు
x
Highlights

చిత్తూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మాజీ రాష్ట్రపతి, అపర మేధావి అబ్దుల్ కలాం తనవద్దే విజన్ నేర్చుకున్నారని...

చిత్తూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మాజీ రాష్ట్రపతి, అపర మేధావి అబ్దుల్ కలాం తనవద్దే విజన్ నేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు విజన్‌–2020తో ముందుకెళ్లానన్నారు.. తన విజన్‌ గురించి తెలుసుకున్న దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం.. ఆ విజన్‌కు సంబంధించిన పలు పత్రాలను తీసుకెళ్లి దేశ ఆర్థిక విజన్‌పై ఓ పుస్తకాన్ని విడుదల చేశారని చెప్పారు. కాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని మామండూరు వద్ద మూడు రోజుల జిల్లాస్థాయి టీడీపీ విస్తృతస్థాయి సమావేశాలు జరుగుతున్నాయి.

ఈ సందర్బంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. గతంలోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు తెలుగుదేశం ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు సిద్ధమైందని, ఎన్నికల కోడ్‌ రావడంతో అది కుదరలేదని అన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టిన దానికంటే తక్కువ ఇవ్వడంలో అర్ధమేమిటని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలో టీడీపి కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు. సీఎం జగన్ కు తన తాత బుద్ధులు వచ్చాయని అందువల్లే ఇలా చేస్తున్నాడని అర్పించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రం రెండంకెల అభివృద్ధిని సాధించిందని చెప్పిన చంద్రబాబు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని నంబర్‌–1గా తీర్చిదిద్దే అదృష్టం తనకు లేదన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories