ఉపాధిహామీ బకాయి నిధులను వసూలు చేస్తాం: బాబు రాజేంద్రప్రసాద్

ఉపాధిహామీ బకాయి నిధులను వసూలు చేస్తాం: బాబు రాజేంద్రప్రసాద్
x
Highlights

రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపుగా సుమారు రూ. 2500కోట్లను తన సొంత పథకాలకు దారి మళ్లించి వాడుకొందని ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపుగా సుమారు రూ. 2500కోట్లను తన సొంత పథకాలకు దారి మళ్లించి వాడుకొందని ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. రాష్ట్ర హైకోర్టు ఎదుట విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సర్పంచ్లు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గ్రామాల అభివృద్ధి కోసం సిమెంట్ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్స్ లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే, వారికి ఇవ్వాలిసిన బిల్లులను ఇవ్వకుండా వారిని దారి మళ్లించరని అన్నారు.

ప్రభుత్వ చర్యలను నిలదీస్తూ హైకోర్టు లో కేసు వేయ్యడం జరిగిందని, మార్చి 2న ధర్మాసనం ముందుకు కేసు రానుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఎలాంటి ఉద్యమానికైనా వెనకాడబోమని ప్రభుత్వాన్ని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీమంత్రి వర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ విప్ కూనరవికుమార్, వల్లూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories