విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ దుర్ఘటనలో 12 మంది మరణించారు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ దుర్ఘటనలో 12 మంది మరణించారు. వందలాది మంది ఆస్పత్రుల పాలైయ్యారు. ఆ సంస్థకు అనుమతులు ఇచ్చింది మీరంటే మీరంటూ.. అధికార ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. చంద్రబాబు హయాంలోనే అనుమతులు ఇచ్చారంటూ ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎల్జీ పాలిమర్స్ అనుమతుల్లో టీడీపీపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. సీఎం జగన్ అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూడడం దారుణమని ఆరోపించారు. అందుకే సాక్ష్యాధారాలతో సహా ముందుకు రావాల్సి వచ్చిందని తెలిపారు.
1961 నుంచి 2020 వరకు ఈ కంపెనీ పూర్వాపరాలను ప్రజల దృష్టికి తెస్తున్నామని వివరించారు. కంపెనీ వినియోగిస్తున్న 219 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. 1964లో నవంబరు 23న అప్పటి సర్కారు ఎకరా రూ.2,500 చొప్పున కేటాయించినట్టు వెల్లడించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపులను 1992లో అక్టోబరు 8న అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని, టీడీపీ హయాంలో ఒక్క ఎకరం భూమి కూడా ఎల్జీ పాలిమర్స్ కు కేటాయించలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
2007లో మే 8న వైఎస్ ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చిందని, 2009లోనూ... వైఎస్ ప్రభుత్వమే మరోసారి పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చిందని వివరించారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 2012లో ఏప్రిల్ 13న, 2012లో మే 6న పలు క్లియరెన్స్ లు ఇచ్చిందని తెలిపారు. వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డిల ప్రభుత్వాలు రెండుసార్లు చొప్పున అనుమతులు ఇచ్చాయని చంద్రబాబు వెల్లడించారు. Andటీడీపీ ప్రభుత్వం వాటిని రెన్యువల్ చేసిందని అన్నారు. పాలిస్టైరీన్ విస్తరణ, ఉత్పత్తుల విస్తరణకు టీడీపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని తెలిపారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire