ప్రముఖ వేణుగాన విద్వాంసురాలు డాక్టర్‌ జయప్రదకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి

ప్రముఖ వేణుగాన విద్వాంసురాలు డాక్టర్‌ జయప్రదకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి
x
Highlights

ప్రముఖ వేణుగాన విద్వాంసురాలు డాక్టర్‌ జయప్రద రామమూర్తికి అరుదైన గౌరవం దక్కింది. ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆధ్యాత్మిక ఛానల్ ఎస్వీబీసీ...

ప్రముఖ వేణుగాన విద్వాంసురాలు డాక్టర్‌ జయప్రద రామమూర్తికి అరుదైన గౌరవం దక్కింది. ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆధ్యాత్మిక ఛానల్ ఎస్వీబీసీ బోర్డులో డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వేణుగాన విద్వాంసురాలైన తొలి మహిళ డాక్టర్‌ జయప్రదే. అంతర్జాతీయ స్థాయిలో ఆమె కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు.

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సారథ్యంలోని పలు ప్రాజెక్టుల్లో ఆమె పనిచేశారు. ఈ సందర్బంగా ఎస్వీబీసీ చానల్‌ బోర్డులో డైరెక్టర్‌గా నియమించినందుకు ఏపీ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. జాతీయ కళాకారిణిగా ఇది తనకు వచ్చిన గౌరవమన్నారు. శ్రీ వేంకటేశ్వరుని సేవకు ఈ పదవిని అవకాశంగా భావిస్తున్నానన్నారు. కాగా ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వి రాజ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఎస్వీబీసీ డైరెక్టర్లుగా సీనియర్ జర్నలిస్ట్ స్వప్న, సినీ దర్శకుడు శ్రీనివాసరెడ్డి లను కూడా నియమించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories