Devineni Avinash: ప్రజలకు ఎంపీ కేశినేని చిన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి

Devineni Avinash: తిరువూరు సమీపంలోని నెమలి వేణుగోపాల స్వామి ఆలయం గొప్పతనాన్ని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికిపూడి కలిసి బ్రస్టు పట్టించారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ మండిపడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 March 2026 2:46 PM IST
Devineni Avinash: ప్రజలకు ఎంపీ కేశినేని చిన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి
X

Devineni Avinash: ప్రజలకు ఎంపీ కేశినేని చిన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి

Devineni Avinash: తిరువూరు సమీపంలోని నెమలి వేణుగోపాల స్వామి ఆలయం గొప్పతనాన్ని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికిపూడి కలిసి బ్రస్టు పట్టించారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ మండిపడ్డారు. పార్లమెంట్ సబ్యుడిగా ఉండాల్సిన హుందాతనం కేశినేని చిన్నికి లేదన్నారు. హిందూధర్మాన్ని కాపాడుతున్నాం అని చెప్పుకునే చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గతంలో దసరా మహోత్సవాల సందర్భంలోనూ విజయవాడ ఉత్సవాల పేరుతో ఎంపీ కేశినేని అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన తప్పుడు పనులు నిలదీసిని వారిపై అసత్య ప్రచారాలు చేయడం కూటమి నేతలకు అలవాటుగా మారిందన్నారు. తిరువూరు ప్రజలకు ఎంపీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story