పవన్ కళ్యాణ్ రేపటి పర్యటన వివరాలు

పవన్ కళ్యాణ్ రేపటి పర్యటన వివరాలు
x
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. ఆదివారం ఆయన అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దీంతో పవన్‌ పర్యటనకు...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. ఆదివారం ఆయన అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దీంతో పవన్‌ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన అభిమానులు. ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం వేమగిరి, కడియం, కడియం సావరరం మీదుగా మండపేట నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ వెలగతోడు, ఇప్పనపాడుల్లో రైతులతో చర్చిస్తారు. అనంతరం మండపేట పట్టణానికి చేరుకుంటారు. తరువాత అమలాపురం పార్లమెంట్‌ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం అవుతారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు, ఇంచార్జిలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని జనసేన వెల్లడించింది.

రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు పవన్‌ జిల్లాలో పర్యాటిస్తున్నారని.. స్థానిక నేతలు, జనసైనికులంతా భారీగా హాజరై పర్యటనను విజయవంతం చేయాలని కోరారు జిల్లా అధినాయకత్వం కోరింది. ముఖ్యంగా రైతులకు మద్దతు ధరపై చర్చిస్తారని తెలిపారు. కాగా నిన్న(శుక్రవారం) పవన్ రాయలసీమ పర్యటనను పూర్తి చేసుకున్నారు. పర్యటనలో పలు పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. పవన్ పర్యటన ఆసాంతం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించేలా సాగింది. కాగా మదనపల్లి పర్యటనలో పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో గందరగోళం నెలకొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories