విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేయండిలా

విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేయండిలా
x
Highlights

విశాఖ భూ కుంభకోణంపై వైసీపీ ప్రభుత్వం విజయ్‌ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం రంగంలోకి దిగిన సిట్ బృందం.. కీలక...

విశాఖ భూ కుంభకోణంపై వైసీపీ ప్రభుత్వం విజయ్‌ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం రంగంలోకి దిగిన సిట్ బృందం.. కీలక డాక్యూమెంట్లను పరిశీలిస్తోంది. అలాగే నవంబరు ఒకటి నుంచి ఏడవ తేది వరకు ఫిర్యాదులు స్వీకరించనుంది. ఈ మేరకు శనివారం సిట్ పబ్లిక్ నోటీసు విడుదల చేసింది. నవంబరు 8న స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి కూడా అర్జీలు స్వీకరిస్తామని తెలిపింది.

నేరుగా వచ్చి ఫిర్యాదు చేసినా.. స్వీకరిస్తాం.. లేదంటే ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేసినా అర్జీలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎంతటి వారైనా సరే విచారిస్తామని సిట్ చీఫ్ విజయ్‌ కుమార్ చెప్పారు. కాగా విశాఖ సిరిపురం చిల్డ్రెన్ ఎరీనాలొ ఉదయం 10 గంటల నుంచి ఫిర్యాదులను పరిశీలించనుంది సిట్ బృందం. విచారణ సందర్భంగా సిట్ బృందానికి ఏలేరు గెస్ట్‌ హౌజ్‌లో బస ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories