Cyber Fraud: ఏఐ వీడియోతో సీఎం చంద్రబాబుపేరుతో డబ్బులు వసూలు

టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు పేరుతో ఏఐ టెక్నాలజీ ద్వారా మోసం చేస్తున్న చిత్తశుద్ధి నిందితుడు భార్గవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Oct 2025 10:54 AM IST
Cyber Fraud: ఏఐ వీడియోతో సీఎం చంద్రబాబుపేరుతో డబ్బులు వసూలు
X

Cyber Fraud: ఏఐ వీడియోతో సీఎం చంద్రబాబుపేరుతో డబ్బులు వసూలు

టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు పేరుతో ఏఐ టెక్నాలజీ ద్వారా మోసం చేస్తున్న చిత్తశుద్ధి నిందితుడు భార్గవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సైబర్ నిందితుడు చంద్రబాబు, దేవినేని ఉమా పేర్లను ఉపయోగించి అక్రమంగా డబ్బులు వసూలు చేశాడని సమాచారం.

నెల క్రితం, కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని ఓ టీడీపీ నేత నుంచి రూ. 50,000 వసూలు చేసిన భార్గవ్, సత్తుపల్లికి చెందిన టీడీపీ నేతలకు చంద్రబాబు ఏఐ వీడియోతో బురిడీ చూపించాడు. తూర్పు గోదావరి జిల్లా వెంకన్నగూడెంకి చెందిన భర్తగ్ ను గుర్తించారు.

నల్లజర్ల పోలీసులు భార్గవ్ ఇంటికి వెళ్లగా, అతని తల్లిదండ్రులు షాక్ అయ్యారు. భార్గవ్ మోసాలకు పాల్పడుతూ గత ఏడాది తమ దగ్గరకు రాలేదని వారు తెలిపారు. బీటెక్ పూర్తి చేసిన భార్గవ్‌పై గతంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story