తిరుమల కొండపై తిరునామంతో గోవు సంచారం

తిరుమల కొండపై తిరునామంతో గోవు సంచారం
x
Cow with Tirumala Balaji Thirunamam
Highlights

తిరుమలలో ఓ గోవు చూపరులను ఆకట్టుకుంటుంది. లాక్‌డౌన్ కావడంతో భక్తులకు శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.

తిరుమలలో ఓ గోవు చూపరులను ఆకట్టుకుంటుంది. లాక్‌డౌన్ కావడంతో భక్తులకు శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జన సంచారం లేకపోవడంతో కొండలపై వన్య ప్రాణులు, జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఈ నేథ్యంలో అలిపిరి వద్ద ఈ గోవు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వెంకటేశ్వర స్వామి తిరునామంతో ఉన్న ఓ గోవు కనిపించింది. స్వామివారు నుదట ధరించే తిరునామం మాదిరిగానే ఆ గోవుకు నుదుటిపై పెద్ద ఆకారంలో సహజసిద్ధంగా ఉంది. ఆకలితో అలమటిస్తున్న గోవులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి రోజూ గ్రాసం అందిస్తోంది.

అయితే ఈ గోవును టీటీడీ అధికారులు గోశాలకు తరలించినట్లు తెలుస్తోంది. నుదుటి పై తిరునామం ఆకారంలో ఉన్న అరుదైన గోవును టీటీడీ అధికారులు గోశాలకు తరలిస్తే భక్తులు వీక్షించడానికి బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత నెల 20 వ తేదీ నుంచి రోజులుగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతివ్వడం లేదు. స్వామివారికి కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనం నిలిపివేయడంతో దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆదాయం కోల్పోయింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories