వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు

వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు
x
Undavalli Sridevi File Photo
Highlights

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అవినీతి ఆరోపణలు చేశారు ఆ పార్టీ చెందిన నాయకుడు జాకీర్ . వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సిమెంట్ రోడ్డు బిల్లుల విషయంలో రూ.3 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అవినీతి ఆరోపణలు చేశారు ఆ పార్టీ చెందిన నాయకుడు జాకీర్ . వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సిమెంట్ రోడ్డు బిల్లుల విషయంలో రూ.3 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని బేతపూడి సొసైటీ అధ్యక్షుడు జాకీర్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీరుకు నిరసనగా తన సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు జాకీర్ చెప్పారు. ఎమ్మెల్యే శ్రీదేవి విషయం త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళతామని ముస్లిం మైనారిటీలు తెలిపారు.

ఈ మేరకు మీడియాతో మాట్లాడిన జాకీర్.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పిన వారికే పనులు జరుగుతున్నాయని, చురుగ్గా పని చేసిన వారికి విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తులను పెట్టుకుని పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. 2017- 18 సంవత్సరంలో టీడీపీ నాయకులు రూ. 11 లక్షల బిల్లులు పెట్టారని, మంజూరు చేయొద్దని కోరినట్లు తెలిపారు. కానీ, ఎమ్మెల్యే శ్రీదేవి రూ. 3 లక్షలు లంచం తీసుకుని ఆ బిల్లులు మంజూరు చేయించారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories