అంబటి vs నాగబాబు : ట్వీట్ వార్

అంబటి vs నాగబాబు : ట్వీట్ వార్
x
Ambati Rambabu and Nagababu (File Photo)
Highlights

జనసేన కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం తీరుపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు సినీ నటుడు, జనసేన నేత నాగబాబు.

జనసేన కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం తీరుపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు సినీ నటుడు, జనసేన నేత నాగబాబు.. తాజగా కరోనా నేపద్యంలో ఏపీ ప్రభుత్వం పేద ప్రజలకి రూ. 1000లను పంపిణి చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయంలో నాగబాబు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది.

అంబటి రాంబాబు గురించి నాగబాబు ట్వీట్ చేస్తూ.. " అంబటి రాంబాబు గారికి ఒక విన్నపం.. కేంద్రం కరోనా అకౌంట్‌లో పేదలకు ఇచ్చే రూ.వెయ్యి వైసీపీ ప్రభుత్వం వారు ఇస్తున్నట్లు మీ నాయకులు బిల్డప్ ఇచ్చి రాబోయే ఎలక్షన్స్‌లో ఓట్లు అడుగుతున్నారు. అది ఆపండి సర్.. లేకపోతే శవాల మీద పేలాలు ఎరుకొనే బాచ్ అంటారేమో అని నా ఫీలింగ్ " అంటూ ట్వీట్ చేశారు.

నాగబాబు విమర్శలకు అంబటి రాంబాబు స్పందిస్తూ.. నాగబాబును వదిలేసి మధ్యలో పవన్ కళ్యాణ్ ని ప్రస్తవాన తీసుకువచ్చి 'పవన్ కళ్యాణ్ ఇలాంటి తప్పుడు విమర్శలు మీకు అవసరమా..కేంద్రం ఇస్తున్న డబ్బు అది జన్ ధన్ జమ అవుతుంది.. ఇక్కడ జగన్ గారు ఇంటికి చేరే విధంగా చేశారు. రూ.1300 కోట్లు ప్రత్యేకంగా దానికి కేటాయించారు.. రూ.1000 కోట్లు మొన్న ఇచ్చినవి మన లోటు బడ్జెట్ లో భాగం' అని ట్వీట్ చేశారు.

ఇక తాజాగా మళ్ళీ నాగబాబు మరో ట్వీట్ తో పాటు మరో వీడియోని సైతం పోస్ట్ చేశారు. " దేవుడా అంబటి రాంబాబు ఆరోగ్యం నువ్వే కాపాడాలి.. మన చేతుల్లో లేదు. ఈ రోజు రాంబాబు గారి కోసం కూడా నేను దీపం వెలిగిస్తాను.. ఆయన ఆరోగ్యం బాగుపడితే అమ్మోరికి తలనీలాలు సమర్పిస్తాను.. నావి కాదు అంబటి గారి తల నీలాలు' అంటూ సెటైర్లు పేల్చారు. అంతేకాకుండా ఓ వైఎస్సార్‌సీపీ కార్యకర్త రూ.వెయ్యి సాయం అందించి.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేయమని చెబుతున్న వీడియోని సైతం నాగబాబు ట్వీట్ చేశారు. అయితే దీనిపైన నాగబాబు ఎలా స్పందిస్తారో అన్నది చూడాలి మరి!




Show Full Article
Print Article
More On
Next Story
More Stories