Coronavirus Updates in Andhra pradesh : ఆదివారం రికార్డుస్థాయిలో ఏపీలో కరోనా కేసులు

Coronavirus Updates in Andhra pradesh : ఆదివారం రికార్డుస్థాయిలో ఏపీలో    కరోనా కేసులు
x
Highlights

Coronavirus Updates in Andhra pradesh : ఏపీలో కరోనా కేసులు ఆదివారం రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. కొత్తగా 20,567 సాంపిల్స్‌ ని పరీక్షించగా 961 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

Coronavirus Updates in Andhra pradesh: ఏపీలో కరోనా కేసులు ఆదివారం రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. కొత్తగా 20,567 సాంపిల్స్‌ ని పరీక్షించగా 961 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. 391 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్ట్‌ అయ్యారు. కోవిడ్‌ వల్ల కర్నూల్‌ లో ఐదుగురు, అనంతపూర్‌ లో ముగ్గురు, చిత్తూర్‌ లో ఇద్దరు, కడప లో ఇద్దరు, కృష్ణ లో ఒక్కరు , విశాఖపట్నం లో ఒక్కరు మరణించారు.. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 10,17,140 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది.రాష్ట్రంలో 7907 మంది ప్రభుత్వ ఆసుపత్రులలో, అలాగే 2136 మంది కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ లో వెరసి మొత్తం 10043 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,102 పాజిటివ్ కేసు లకు గాను 6828 మంది డిశ్చార్జ్ కాగా 232 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9042 గా ఉంది. ఇక జిల్లాల వారీగా యాక్టీవ్ కేసుల జాబితా ఇలా ఉంది. అనంతపురం 927, చిత్తూరు 849, తూర్పు గోదావరి 1155, గుంటూరు 1063, కడప 801, కృష్ణ 1003, కర్నూల్ 1153, నెల్లూరు 342, ప్రకాశం 323, శ్రీకాకుళం 129, విశాఖపట్నం 337, విజయనగరం 149, పశ్చిమ గోదావరి 811 గా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories