Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 8,702 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in AP | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Published on: 17 Sept 2020 7:13 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 8,702 పాజిటివ్ కేసులు...
X

Coronavirus Updates in AP | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 8,702 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 77,492శాంపిల్స్‌ని పరీక్షించగా 8,702 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 10,712 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు 12, ప్రకాశం 10, కడప 07, గుంటూరు 06, కర్నూల్ 06, నెల్లూరు 06, తూర్పుగోదావరి 05, కృష్ణా 05, అనంతపురం 04, విశాఖపట్నం 04, పశ్చిమగోదావరి 04, శ్రీకాకుళం 02, విజయనగరం జిల్లాలో 01 చొప్పున మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 6,01,462. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,177. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5,08,088కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 88,197 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 48,84,371 కరోనా శాంపిల్స్ కు పరిక్షలు నిర్వహించింది ప్రభుత్వం.

ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 82,447, కర్నూల్ జిల్లా 53,098, అనంతపురం జిల్లా 51,358, పచ్చిమ గోదావరి జిల్లా 54,635, చిత్తూర్ జిల్లా 52,421, విశాఖపట్నం జిల్లా 45,686, గుంటూరు జిల్లాలో 47,880, నెల్లూరు లో 46,122, కడప 38,325, ప్రకాశం జిల్లాలో 39,443 కేసులు నమోదయ్యాయి.




S. Srikanth

S. Srikanth

Next Story