Coronavirus: ఏపీలో 10కి చేరిన కరోనా కేసులు

Coronavirus: ఏపీలో 10కి చేరిన కరోనా కేసులు
x
Highlights

క‌రోనా పంజా దాటికి రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య 41కి చేర‌గా, అటు ఏపీలోనూ కరోనా నిర్ధారిత...

క‌రోనా పంజా దాటికి రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య 41కి చేర‌గా, అటు ఏపీలోనూ కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 8 నుంచి 10కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. తాజాగా శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయింది. గుంటూరు జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా మంగళ్‌దాస్‌నగర్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మార్చి 14న ఈ వ్యక్తి ఢిల్లీలో మతపరమైన సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 19న గుంటూరు వచ్చినట్లు గుర్తించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories