కర్నూల్ లో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్

కర్నూల్ లో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్
x
Highlights

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 కొత్త కేసులు నమోదు అయ్యాయి.తాజా కేసులతో కలిపితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1016కు చేరింది. వీరిలో మొత్తం 171 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటి వరకు 31 కరోనా మరణాలు సంభవించాయి. ఇక ప్రస్తుతం 814 మంది చికిత్స పొందుతున్నారు.

ఇందులో కర్నూల్ లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం ఆ జిల్లాలో 275 కేసులు నమోదు అయ్యాయి. అందులో 259 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఏడుగురు డిశ్చార్జ్ కాగా తొమ్మిది మంది చనిపోయారు. ఇక ఇది ఇలా ఉంటే తాజగా జిల్లాలోని ఇద్దరు డాక్టర్లకు కరోనా సోకినట్లు నిర్దారించారు. దీనితో జిల్లాలో ప్రభుత్వ శాఖలు అన్ని అప్రమత్తమై చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఇప్పటికే 50కి పైగా రెడ్ జోన్ ప్రాంతాలను గుర్తించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories