ఏపీలోని అన్ని జిల్లాలకు కరోనా వ్యాక్సిన్
* గన్నవరం వ్యాధినిరోధక టీకాల కేంద్రం నుంచి సరఫరా * కృష్ణా జిల్లాకు 42,500 డోసులు * ఈస్ట్ గోదావరికి 47,000 డోసులు
representational image
ఏపీలోని అన్ని జిల్లాలకు కరోనా వ్యాక్సిన్ బయలుదేరింది. కృష్ణా జిల్లా గన్నవరంలోని వ్యాధినిరోధక టీకాల కేంద్రం నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ను సరఫరా చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు 42,500 డోసులు, గుంటూరు జిల్లాకు 43,500. ప్రకాశం జిల్లాకు 31,000, నెల్లూరు జిల్లాకు 38,500. వెస్ట్ గోదావరిజిల్లాకు 33, 500, ఈస్ట్ గోదావరికి 47,000, శ్రీకాకుళం 26,500. విశాఖపట్నం 46,500, విజయనగరం 21, 500, అనంతపురం 35,500, కర్నూలు జిల్లాకు 40,500, చిత్తూరు 41,500, వైఎస్సార్ కడప జిల్లాకు 28,500 డోస్లను అధికారులు పంపించారు.
Next Story




