Corona kits scam in Kakinada: కాకినాడలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

Corona kits scam in Kakinada: కాకినాడలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం
x
Highlights

Corona kits scam in Kakinada: కాకినాడలో ఉచితంగా ప్రజలకు పరీక్షలు నిర్వహించాల్సిన కిట్లు ప్రయివేటు ఆసుపత్రులకు తరలి పోతున్నాయి.

ఒక పక్క ప్రజలు కరోనా ఇక్కట్లలో ఉన్నారు. కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా సహాయం చేద్దామని ప్రయతింస్తుంటే వైద్య శాఖలో ఇంటి దొంగలు ఆ ఇంతా కరోనా కిట్లను కూడా తినేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కిట్లు పక్కదారి పడుతున్నాయి. సాధారణ ప్రజలకోసం ఉచితంగా టెస్టులు చేయాడం కోసం ప్రభుత్వం అందచేస్తున్న కరోనా కిట్లను ప్రయివేట్ ఆసుపత్రులకు అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. వివరాలు ఇవీ..

- ఉచితంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇస్తోన్న ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను ప్రైవేట్ ఆస్పత్రులకు అమ్ముతున్నట్టు ఆరోపణలు..

- కాకినాడ కార్పోరేషన్ పరధిలో కిట్లు పక్కదారి పట్టినట్టు గుర్తించిన అధికారులు..

- నగరపాలక సంస్థ మెడికల్ ఆఫీసర్ కరీముల్లా ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి..

- హెల్త్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ ను మాతృసంస్థకు బదిలీ..

- కిట్ల మాయాజాలంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి..

- ఫోర్జరీ సంతకాలతో మరో 300 కిట్లు తీసుకునట్టు విచారణలో గుర్తింపు..

- కాకినాడ జీజీహెచ్ లో ఎంఎన్ఓగా పని చేసి బాషా ఫోర్జరీ చేసినట్టు నిర్ధారణ..

- ప్రస్తుతం అమలాపురం ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తోన్న బాషా..

- జీజీహెచ్ ఆర్ఎంఓ సంతకం ఫోర్జరీ చేసి 300 కిట్లు తీసుకుని.వెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరీ..

- రంగంలోకి దిగిన కాకినాడ త్రీ టౌన్ పోలీసులు.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన బాషా..

- ఇప్పటి వరకు వచ్చిన కిట్లు నిర్వహించిన పరీక్షలపై విచారణ చేపట్టిన పోలీసులు..

- కిట్లు జారీ చేసే విభాగంలో సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేసిన డిఎం అండ్ హెచ్ఓ సుపరహ్మణ్యేశ్వరీ..

- ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ మల్లిక్ పాత్ర పైనా అనుమానాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories