వైసీపీ వారికోసమే ఇసుక కొరత సృష్టించారు : తులసిరెడ్డి

వైసీపీ వారికోసమే ఇసుక కొరత సృష్టించారు : తులసిరెడ్డి
x
Highlights

ప్రభుత్వం కావాలనే ఇసుక కొరత సృష్టిస్తోందని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి ఆరోపించారు. కడపలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు...

ప్రభుత్వం కావాలనే ఇసుక కొరత సృష్టిస్తోందని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి ఆరోపించారు. కడపలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధుల కోసమే ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని ఆయన అన్నారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అండతో ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వమే ఇసుక కొరత సృష్టించి.. మళ్ళీ ఇసుక వారోత్సవాలు చేయడం ఏంటని తులసీరెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు కావాల్సిన మేర ఇసుక లభించడంలేదని ఆయన మండిపడ్డారు.. ఇసుక దొరక్క కార్మికులకు పనిలేదని.. దాంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. ఇకనుంచైనా నదుల్లో ఇసుక రీచ్‌లను వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, ఇతర నేతలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories