ఇంటిపై దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు: సుంకర పద్మశ్రీ

ఇంటిపై దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు: సుంకర పద్మశ్రీ
x
Highlights

కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మరోసారి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాజధానిని కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలు, రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మరోసారి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాజధానిని కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలు, రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. అమరావతిలోని రైతులకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని.. బలవంతంగా రాజధానిని తరలిస్తే ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తనపై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి .. ఇంటిపై దాడి చేసి చంపేస్తామాని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదని ఆమె అన్నారు.

కాగా గతంలో అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన సుంకర పద్మశ్రీ సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. తుళ్లూరులో జరిగిన రైతుల ఆందోళన దీక్షకు సంఘీభావం ప్రకటించిన ఆమె చెప్పుదెబ్బలు తింటావ్ జగన్మొహన్ రెడ్డీ అంటూ చెప్పు చూపించారు. అంతేకాదు ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్న అంబటి రాంబాబును ఆమె పిచ్చి కుక్కతో పోల్చారు. అర్థరాత్రి అరెస్ట్ చేయడానికి రైతులు జగన్‌ తరహాలో జైలుకు వెళ్లలేదని అన్నారు. ఏపీ డీజీపీ సీఎం జగన్‌కు చెంచాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. దాంతో వైసీపీ నేతలు ఆమెపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories