హాట్‌టాపిక్‌గా మారిన టీడీపీలో కోల్డ్‌వార్‌

హాట్‌టాపిక్‌గా మారిన టీడీపీలో కోల్డ్‌వార్‌
x
Highlights

టీడీపీలో కోల్డ్‌వార్‌ నడుస్తోంది. తెలుగుతమ్ముళ్ల మధ్య అంతర్గ బేధాలుమరోసారి బయటపడ్డాయి. ట్విటర్‌ వేదికగా పచ్చలీడర్లు రచ్చకెక్కారు. సొంత పార్టీపైనే...

టీడీపీలో కోల్డ్‌వార్‌ నడుస్తోంది. తెలుగుతమ్ముళ్ల మధ్య అంతర్గ బేధాలుమరోసారి బయటపడ్డాయి. ట్విటర్‌ వేదికగా పచ్చలీడర్లు రచ్చకెక్కారు. సొంత పార్టీపైనే విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. ఒకరిపై మరోకరు సోషల్‌మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. టీడీపీ నేతల మధ్య ట్విట్టర్ లో చిన్నపాటి యుద్ధం నడుస్తోంది.

ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్‌ చేసిన విజయవాడఎంపీ కేశినేని నాని రీసెంట్‌గా టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను హాట్‌ పోస్ట్‌ పెట్టడం పార్టీలో కలకలం రేపుతోంది.

నాలుగు ఓట్లు రాని వాడు నాలుగు పదవులు సంపాదించాడని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను విమర్శించారు. ఈ విమర్శలను తిప్పికొట్టిన వెంకన్న.. సంక్షోభంలో టీడీపీకి పార్టీని కాపాడేవాడు కావాలనీ, నీలా కూల్చేసేవాడు కాదని కౌంటర్ ఇచ్చారు.

బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలకు కొద్ది గంటల్లోనే స్పందించిన కేశినేని నాని మరో కౌంటర్‌పోస్ట్‌ పెట్టారు. కొందరు నిన్నటి దాకా చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారనీ, రేపటి నుంచి వైసీపీ నేత విజయసాయిరెడ్డి కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఇద్దరివీ కాళ్లు మాత్రమేననీ, వ్యక్తులు మాత్రమే తేడా అని కేశినేని నాని మరో ట్వీట్ చేశారు.

ఇటు కేశినేని చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. సంక్షోభం సమయంలో పార్టీ కోసం నాయకుడి కోసం పోరాడేవాడు కావాలని సైటైర్లు చేశారు. ఇతర పార్టీ నాయలకుతో కలిసి కూల్చేవాడు ప్రమాదమన్నారు. నీలాగా అవకాశవాదులు కాదని. చచ్చే వరకు చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడే వాడు కావాలని ట్విట్‌ చేశారు.

చాలారోజుల నుంచి బుద్ధా వెంకన్నకు, కేశినేని నాని మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవల టీడీపీలో షో మ్యాన్‌లు అవసరం లేదంటూ నాని చేసిన వ్యాఖ్యలు విజయవాడ టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్‌ టీడీపీలో కలకలం రేపుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల మధ్య ట్విట్టర్ లో చిన్నపాటి యుద్ధం నడుస్తోంది. నాలుగు ఓట్లు రాని వాడు నాలుగు పదవులు సంపాదించాడని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను విమర్శించారు. ఈ విమర్శలను తిప్పికొట్టిన వెంకన్న.. సంక్షోభంలో టీడీపీకి పార్టీని కాపాడేవాడు కావాలనీ, నీలా కూల్చేసేవాడు కాదని కౌంటర్ ఇచ్చారు.

దీంతో ఆ వ్యాఖ్యలపై కేశినేని నాని మరోసారి తీవ్రంగా స్పందించారు. కొందరు నిన్నటి దాకా చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారనీ, రేపటి నుంచి వైసీపీ నేత విజయసాయిరెడ్డి కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఇద్దరివీ కాళ్లు మాత్రమేననీ, వ్యక్తులు మాత్రమే తేడా అని కేశినేని నాని మరో ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories